KNR: వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన కనకంటి మణెమ్మ (74) శ్రీరామనవమి వేడుకల కోసం ఆసిఫాబాద్ వెళ్లగా, అక్కడ అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.