VKB: అనుమతులు లేకుండా ఎర్రరాయిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రశాంత వర్ధన్ హెచ్చరించారు. నిన్న మండల పరిధిలోని రాంసింగ్ తండా శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.