NGKL: మంతటి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ-మల్లయ్య పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.