కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది