E.G: కొవ్వూరుకు చెందిన జనసేన కార్యకర్త పత్తిగుల్ల నాగరాజు ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. మంగళగిరిలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తల కుటుంబాలకు వెన్నంటి ఉంటుందని, కష్టకాలంలో భరోసా కల్పిస్తుందని నాయకులు తెలిపారు.