NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHS విద్యార్థులకు, 2007-08 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మజ్జిగ వితరణ చేపట్టారు. పాఠశాల చివరి రోజు ఏప్రిల్ 23 వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ బత్తుల లక్ష్మి ప్రసన్న నరసింహ మాట్లాడుతూ.. చొరవ చూపిన పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.