JGL: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు వ్యాస రచన పోటీల్లో బుగ్గారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కెతి శ్రావ్య విజేతగా నిలిచింది. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి మిట్టపల్లి సురేందర్, సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆమెకు నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.