NRML: ముథోల్ గ్రామపంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను నేడు (సోమవారం) వారపు సంత వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్వర్ అలీ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలన్నారు. పాల్గొనే వారు రూ. 10వేలు డిపాజిట్ చెల్లించి వారపు సంత వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.