VZM: బొబ్బిలి మండలం కాసిందోరవలస పంచాయతీ పరిధిలో ఉన్న ఉపాధిహామీ వేతనదారులు వేతనాలు అందక తీవ్ర అవస్థలుపడుతున్నారు. 8వారాలుగా పనిచేస్తున్నా.. ఇప్పటికి రూపాయి కూడ అందలేదని వాపోతున్నారు. గతంలో అయితే 2వారాలలోపు వేతనాలు జమ అయ్యేవని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చడం, వేతనాలు అలసత్వం జరగడం పట్ల, ఈ పధకాన్ని తీసివేస్తున్నారనే చర్చ మొదలైంది.