SKLM: జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామంలో ఇవాళ సాయంత్రం ‘నమస్తే ఎచ్చెర్ల’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెదేపా మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు హాజరై ప్రజా సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు.