NGKL: శ్రీశైలం హైవేపై విద్యుత్ స్తంభం పడటంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వటువర్లపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ శాఖ ఆంక్షల వల్ల మరమ్మతులకు ఆటంకం కలగడంతో, తరచూ కరెంటు సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.