NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవరు గాయాలవ్వగా, సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సిరివెళ్ల, మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన వాహనాన్ని పక్కకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు.