TG: సీఎం రేవంత్ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.