జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆదివారం అంబేడ్కర్ స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.