KMR: గాంధారి మండలంలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఓ కోడలు తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సీతాయపల్లి గ్రామంలో రుక్మవ్వ తలపై కోటవ్వ బండరాయితో కొట్టగా ఆమె అక్కడికక్కటే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.