BHNG: ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధి సమీపంలో బొడ్రాయి, పెద్ద రోలు వద్ద నివాసముంటున్న ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రీ, గౌతమిలు ఉన్నారు. మృతుడికి కుమారులు లేరు. దీంతో తండ్రికి తప్పనిసరి పరిస్థితులలో పెద్ద కుమార్తె గాయత్రి శవయాత్రలో ముందు నడిచి తలకొరివి పెట్టింది.