NZB: మాదకద్రవ్యాలకు స్వస్తి పలుకుదాం జీవితాన్ని ప్రేమిద్దాం” అనే నినాదంతో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.