NGKL: లింగాల మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు