హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం చలివేంద్రమును యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గండికోట సంపత్ మాట్లాడుతూ.. వేసవికాలం ముగిసే వరకు బాటసారులకు మజ్జిగ, నీరు నిమ్మకాయ రసం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.