మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గత కొద్ది రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీరు ఎగువ ప్రాంతాలకు అందడం లేదు. ఒకపక్క పైపులైనుల లీకేజీలు, అక్రమ మోటార్ల వాడకంతో అందరికీ తాగునీరు అందకుండా పోయింది. ట్యాంకర్ ద్వారా పంపిస్తున్న తాగునీరు ప్రజల అవసరాలను తీర్చలేక పోతుంది. ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.