SRPT: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 3,890 కేసులు పరిష్కారమైనట్లు ఈరోజు ఎస్పీ నరసింహా తెలిపారు. ఇందులో ఎంవీ యాక్ట్, ఈ -పెట్టీ, ఐపీసీ సహా పలు కేసులు ఉన్నాయి. త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని, దీనివల్ల ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన వారిని ఆయన అభినందించారు.