MDCL: బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఉషా కంపెనీ కార్మికులతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, హక్కులు, యూనియన్ బలోపేతంపై కార్మికులతో చర్చించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.