NLG: ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుళ్ళ వద్ద నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దారుణమని పేర్కొన్నారు. మనకు వచ్చే 0.5 టీఎంసీలకు 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.