NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలు చేయకుండా 4 కోట్ల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో దేవరకొండ పట్టణానికి చెందిన 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.