VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ, మండల అధికారులు పాల్గొన్నారు.