VZM: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా MP కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ తన స్వగ్రామం V.N. పురంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దశ నుంచి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ MPగా నన్ను ఢిల్లీకి పంపించిన టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.