BDK: ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుజాత సూచించారు. కొత్తగూడెంలోని పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ స్పోర్ట్స్ స్టేడియంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా శిక్షణ, ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. యోగా ద్వారా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు.