MBNR: సీసీకుంట మండలం మండబండర్పల్లి గ్రామంలోని అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి 44 వ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞ కార్యక్రమాలతో పాటు, ఏప్రిల్ 2న స్వామివారి కళ్యాణోత్సవం, రాత్రి వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.