HNK: కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెలలో ప్రారంభమయ్యే జనగణన ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఇంటి సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని, ఈ డేటా ప్రభుత్వ ప్రణాళికలకు కీలకమని పేర్కొన్నారు.