శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను దారులకు 50% వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమేనని కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. ఆదివారం సెలవు రోజున కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పన్నులు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు.