GDWL: గ్రామంలో మౌలిక వసతుల కల్పనే తన లక్ష్యమని కొత్తపల్లి సర్పంచ్ సురేశ్ అన్నారు. శనివారం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి దశలవారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి జయన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.