MLG: జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలు తమ మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ పథకాలను ప్రతి మహిళకు చేరవేయాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు.