ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య మృతి చెందాడు. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రమణయ్య క్రింద పడగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా కానిస్టేబుల్ మృతి చెందాడు. ప్రమాదంపై పలువురు అధికారులు విచారం వ్యక్తం చేశారు.