PLD: నరసరావుపేట కలెక్టరేట్లో ప్రముఖ కవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ సూచన మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ సంజన సింహా పాల్గొని, పుట్టపర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహితీ సేవలను, గ్రంథ రచనలను కొనియాడారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.