MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం (హన్మంతరావు) కాలనీకి చెందిన రాజు- సునీత దంపతుల రెండవ కుమార్తె కృప డెంగ్యూ బారినపడి కన్ను మూసింది. సమాచారం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత ఖర్చులతో చిన్నారి అంతక్రియల కోసం ఆ కుటుంబానికి రూ.5,000 తక్షణ సాయం అందించి పెద్ద దిక్కుగా నిలిచారు.