MBNR: మహబూబ్నగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహన పత్రాలు (ఆర్సీ) తమ వెంటే ఉంచాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.