తన గుర్తింపు దుర్వినియోగానికి సంబంధించిన కేసులో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గంభీర్ పేరు, ఫొటో, వాయిస్, ఏఐ జనరేటెడ్తో కూడిన వీడియోలను 36 గంటల్లో తొలగించాలని ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో గంభీర్ గుర్తింపును దుర్వినియోగం చేసినట్లు న్యాయవాదులు వాదనలు వినిపించారు.