అనకాపల్లి: కోటవురట్ల మండలం కొడవటిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి శనివారం పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించడంతో పాటు శ్రమదానంతో వ్యర్ధాలను తొలగిస్తున్నామన్నారు.