CTR: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 1న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ తెలిపారు. ఆయన ఆ సంఘం నేతలతో కలిసి కలెక్టరేట్లో డీఆర్వో మోహన్ కుమార్కు ముందస్తు నోటీసు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.