KNR: సైదాపూర్ రైతు వేదికలో 5 రోజులుగా జరుగుతున్న తొలి విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 122 మంది వార్డు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, వార్డు సభ్యుల విధులు, తదితర కీలక పరిపాలనా అంశాలపై వీరికి నిపుణులు అవగాహన కల్పించారు.