BDK: న్యాయవాదుల సంక్షేమానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని న్యాయమూర్తి వసంత్ పాటిల్ కోరారు. భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా జడ్జి వసంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూల మొక్కలు అందజేసి తమ కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు.