JGL: ధర్మపురి పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. నూతనంగా ఏర్పాటు చేసిన లైన్ను ప్రారంభించిన మంత్రి, 2009 నుంచి ప్రజా సమస్యలపై అవగాహనతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానాని అన్నారు. రూ.4.60 కోట్లతో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.