SRD: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టుల వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు. మద్యం, గంజాయి, అక్రమ ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.