కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 214 మందిపై కేసులు నమోదు చేసి, రూ.49,875 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ దగ్గర పెట్టుకుని వాహనం నడపాలని, శిరస్త్రాణం, సీటు బెల్టు ధరించాలని సూచించారు.