NDL: పగిడ్యాల మండలంలో ఎస్సై దుర్భాషలాడడంతో పూజారి బాలశివుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దేవాలయ వివాదం నేపథ్యంలో జరిగిన వాగ్వాదంలో తనను అవమానించారని ఆయన వాపోయారు. అపస్మారక స్థితిలో పడిపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.