HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలను మరింతగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి ఇటీవల రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం, రైతులు, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రయోగశాలలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేశారు.