PDPL: గోదావరిఖని కోదండ రామాలయంలో సింగరేణి స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు శ్రీరామనవమి సందర్భంగా భక్తులను నియంత్రించడానికి సేవలు అందించారు. ఈ సందర్భంగా ACP రమేష్, సింగరేణి అధికారులు విద్యార్థులను అభినందించారు. వాలంటీర్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఆలయ కమిటీ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.