ప్రకాశం: పామూరు పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త లైన్లు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఎర్రచేలు, విరువూరు రోడ్డు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.