MNCL: బెల్లంపల్లి పట్టణ పోచమ్మ చెరువులో శుక్రవారం వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. తాళ్ళగురిజాల SI రామకృష్ణ వివరాలు.. బూడిదగడ్డ బస్తీలో నివసించే శీలం రాజం గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేదు. ఈనెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, చెరువు వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగి చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.