ATP: అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా సీతారాముల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది.